MNCL: ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుతం అంతేమేర నీటితో నిండుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలకు ప్రస్తుతం 20.1754 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 113867 క్యూసెక్కుల నీరు చేరగా 11 గేట్లు ఎత్తి అంతేమేర నీటిని గోదావరిలోకి విడుదల చేశారు.