ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని వేములపాడు రహదారిలో ఎస్సై కే మాధవరావు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అనంతరం వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనక సీట్లో కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాలని, లేకుంటే రూ.1000లు జరిమానా ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.