WGL: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ హతీరామ్ కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ కానిస్టేబుల్ భార్య కీర్తీకి శుక్రవారం అందజేశారు. ప్రభుత్వ బెనిఫిట్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, ఎస్పీ యాకుబ్ బాబా, తులసి తదితరులున్నారు.