కడప: జిల్లాలో శుక్రవారం 62 కేంద్రాల్లో సెకండ్ ఇంటర్ జువాలజీ, సివిక్స్ పరీక్షలు జరిగాయి. మొత్తం 6,801 మంది విద్యార్థులకు గాను 6,528 మంది హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 5,659 మందికి 5,453 మంది, ఒకేషనల్ విద్యార్థుల్లో 1,142 మందికి 1,075 మంది పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.