JN: దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త పరిదిలు యాదయ్య సతీమణి అంజమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న MLA యశస్విని రెడ్డి సోమవారం మృతురాలు ఇంటికి వెళ్లారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.