ఏలూరు: నూజివీడులో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ప్రత్యేక ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. పట్టణ సీఐ పి. సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ల ఆదేశంతో మెడికల్ క్యాంపు నిర్వహించామన్నారు. మహిళల సంరక్షణ ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు.