VSP: శ్రీ సింహాద్రి అప్పన్న స్వామివారి స్వర్ణ పుష్పార్చన ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు, 108 బంగారు పుష్పాలతో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామిని సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండప వేదికపై వేదమంత్రాలు, నాదస్వర, మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణ పుష్పార్చన ఘనంగా నిర్వహించారు.