NRML: జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున, సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం నిలిపివేస్తున్నామని, కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ సూచించారు.