NZB: నిజామాబాద్ పర్యటనకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను శుక్రవారం టీఎన్జీవో సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జాఫర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.