ELR: జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. జీఎస్టీ తగ్గింపును పురస్కరించుకొని గురువారం భీమడోలు గ్రామంలో ఆప్కాబ్ ఛైర్మన్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటరులో జీఎస్టీ 2.0 వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు కరపత్రాలు పంచుతూ వివరించారు.