MNCL: గత కమిషనర్ కాలంలోని హరితహారం చెక్కు చెల్లింపుల విషయమై కమిషనర్ చాంబర్లో చర్చ జరగగా చెన్నూర్ కాంగ్రెస్ నాయకుడు సుద్దమల్ల సుశీల్ తనను దూషించాడని కమిషనర్ మురళీకృష్ణ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల నామినేషన్ డబ్బులు స్వాహా చేద్దామని చూస్తున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు.