NLR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు జిల్లా పార్లమెంటరీ టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. జోనల్ ఇంఛార్జ్ రాంభూపాల్ రెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ సమక్షంలో ఈ భేటీ నిర్వహించారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి సమాన అవకాశాలు, మహిళలకు ప్రాధాన్యం, జిల్లా అనుబంధ సంఘాల బలోపేతానికి అందరు కృషి చేయాలని చర్చించారు.