KMM: ఖమ్మంకు చెందిన శ్రీనివాసరావు వద్ద 2016లో రాజేంద్రప్రసాద్ రూ.10 లక్షలు అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించేందుకు ఆయన జారీ చేసిన రూ.12 లక్షల విలువైన చెక్కులు బ్యాంక్లో బౌన్స్ అవ్వడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన ఖమ్మం న్యాయమూర్తి బిందు, నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు.