కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్న ప్రసాదం వితరణకు ఆదివారం పితానివారిపాలెం వాస్తవ్యులు బొంతు వెంకట సత్యనారాయణ, మీరమ్మ దంపతులు రూ. 80,116 విరాళం అందించారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.