PDPL: 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 13-18 వరకు ప్రత్యేక ‘Arrive-Alive’ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. నిన్న సంబంధిత అధికారులతో సమీక్షలో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు.