WG: ఇరగవరం మండలం తూర్పువిప్పర్రులో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచాను ఎస్సై జానా సతీష్ గురువారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారు నారాయణపురం గ్రామానికి చెందిన మామిడిశెట్టి శ్రీను తూర్పువిప్పర్రులో గోనెసంచుల ఫ్యాక్టరీలో బాణసంచా అక్రమంగా నిల్వ ఉంచినట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడి చేశారు. ఈ మేరకు సుమారు రూ.30 వేలు విలువ చేసే బాణాసంచాను స్వాధీనం చేసుకున్నారు.