HYD: తెలంగాణ పోలీస్ ఉమెన్ సేప్టీ వింగ్ ఆధ్వర్యంలో స్టాండ్ విత్ హర్ అనే కార్యక్రమాన్ని రేపు జేఎన్టీయూలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఆయనతో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ధనసరి సీతక్క, తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి పాల్గొననున్నారు.