BHNG: బీఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకటరెడ్డి గురువారం కలెక్టర్ అనురాగ్ జయంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. బస్వాపూర్ రిజర్వాయర్ కారణంగా తమ గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతోందని, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్కు విన్నవించారు. గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.