ATP: పామిడి మండలం జి. కొట్టాల గ్రామంలోని శ్రీనివాస్ ఆచారికి చెందిన వేరుశనగ, వరి గడ్డి వాములు గురువారం అగ్నికి ఆహుతయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి గడ్డి, డ్రిప్, స్ప్రిం క్లర్లు కాలిపోయాయని బాధితుడు తెలిపాడు. దీంతో రూ.2.50 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.