అన్నమయ్య: ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని MRO అమర్నాథ్ హెచ్చరించారు. గురువారం కోడూరు మండలం రాఘవరాజపురం పంచాయతీలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో సర్వేయర్ బాలసుబ్రమణ్యంతో కలిసి సర్వే నిర్వహించి, ప్రభుత్వ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.