E.G: అమరావతిలో బీ.సీ సంక్షేమం, చేనేత జౌళి శాఖా మంత్రి ఎస్.సవితను గురువారం రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. మండపేట నియోజకవర్గంలో చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. వీలైనంత త్వరగా చేనేతలకు రావలసిన బకాయిలను అందించి, వారిని ఆదుకోవాలని మంత్రికి ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు.