AKP: సంపద కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం సమకూర్తుందని ఎస్ రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ అన్నారు. గురువారం కర్రివానిపాలెంలో సంపద కేంద్రాన్ని సందర్శించారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛ రథం షెడ్యూల్ ప్రకారం వస్తుందన్నారు. స్వచ్చ రథం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.