KDP: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష కోసం ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు టిటిడి జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి మేళతాళాలతో స్వాగతం పలికారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మీనాతో కలిసి స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వాదంతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.