ATP: పామిడి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గురువారం ACB అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటున్న ప్రైవేటు వ్యక్తి వడ్డే వెంకటేశ్వర్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సబ్ రిజిస్టర్ అధికారి రాధా రమణ లంచం తీసుకోమని చెప్పినట్లు వడ్డే వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులకు తెలిపారు.