TPT: 8వ జన్ ఔషధీ దివస్ సందర్భంగా శ్రీకాళహస్తిలోని ప్రధానమంత్రి జన్ ఔషధ కేంద్రంలో గురువారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కే. వెంకట భాస్కర్ నేతృత్వంలో జరిగిన ఈ శిబిరంలో రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రప్ప, ఏపీ ఫార్మా కౌన్సిల్ సభ్యుడు రాము తదితరులు పాల్గొన్నారు.