SDPT: జల్సాలకు అలవాటుపడి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట సీఐ ఉపేందర్ మాట్లాడుతూ.. ఏపీకి చెందిన ఉప్పల జగదీశ్ (23), పీత చెన్నకేశవ నూకరాజు కార్తీక్ (22) అనే నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పోలీసులు ఇద్దరి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.