KMM: ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా రైతులు పండించిన మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు నాగేశ్వరరావు అన్నారు. గురువారం చింతకాని మండలం నాగులవంచ రైతు వేదికలో సొసైటీ సీఈఓ శ్రీనివాసరావుకు ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. మద్దతు ధర ప్రకారం రైతుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.