BPT: మహాత్మ జ్యోతి బాఫూలే ఏపీ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును పెంచినట్లు గురువారం నిజాంపట్నం ప్రిన్సిపల్ వై. నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఇప్పుడు విద్యార్థులు మార్చి 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.