కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీలో అనవసరంగా పెరిగిన గడ్డి కారణంగా కాలనీవాసులు దోమల బారిన పడుతున్న సమస్య తలెత్తింది. ఈ సమస్యను గుర్తించిన టిడ్కో కాలనీ జనసేన ఇంఛార్జ్ వెంకటేష్ వెంటనే స్పందించారు. పారిశుద్ధ్య సిబ్బందికి తెలియజేసి కాలనీలో పెరిగిన గడ్డిని తొలగించే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. దీంతో కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది.