వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడట. దర్శకుడు మగిళ్ తిరుమేనితో విజయ్ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించనున్నట్లు టాక్. ఈ మేరకు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో హిందీ నటుడు సంజయ్ దత్ విలన్గా చేయనున్నాడట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.