PDPL: ధర్మారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 38 మంది లబ్ధిదారులకు 38,04,408 రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం అందజేశారు. పేద ఆడపిల్లలకు ఈ పథకం వరం, సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.