ATP: బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులో సచివాలయం సిబ్బంది యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహించారు. కుటుంబాల ఆర్థిక, సామాజిక వివరాలను సేకరించి UFS యాప్లో నమోదు చేస్తున్నారు. ఈ సర్వే ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి అందుతుందని పంచాయతీ అభివృద్ధి అధికారి మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ షబానా బేగం పాల్గొన్నారు.