W.G: ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి వెళ్తున్న ఆశా వర్కర్లను నరసాపురంలో పోలీసులు అడ్డుకున్నారు. గురువారం రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని రైలు ఎక్కకుండా నిలువరించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం వెళ్తున్న తమను అడ్డుకోవడంపై ఆశా వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్ పరిసరాల్లో ఆందోళన చేపట్టారు.