KDP: ఎర్రగుంట్లలోని మండల పరిషత్ కార్యాలయ సభా భవనంలో ఈ నెల 7వ తేదీన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వెంకటరమణయ్య తెలిపారు. ఈ సమావేశ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు. ప్రగతి పనులకు సంబంధించి నివేదికలను తప్పక సమర్పించాల్సి ఉంటుందన్నారు. సమావేశ కార్యక్రమానికి ఎవరు గైర్హాజరు కావద్దని హెచ్చరించారు.