GDWL: అయిజ మున్సిపాలిటీలోని అంబేడ్కర్ చౌరస్తా ఎదురుగా ఉన్న బీసీ శ్మశాన వాటికలో గురువారం ముళ్లపొదలు తొలగించారు. ఛైర్మన్ సీఎం సురేశ్ ఆదేశంతో 9వ వార్డు కౌన్సిలర్ నరసమ్మ ఆధ్వర్యంలో జేసీబీతో ముళ్లపొదలు తొలగించి, శ్మశాన వాటికను శుభ్రపరచారు. చాలా కాలంగా నిర్వహణ లేక అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి తొలగించారు.