CTR: ఈనెల 10, 11 తేదీల్లో జరిగే శ్రీసుగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లపై మున్సిపల్ ఛైర్మన్ ఆలీ బాషా సమీక్ష నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జాతర నిర్వహణ కోసం మున్సిపాలిటీ తరఫున రూ. 10 లక్షలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.