VKB: యాలాల మండలంలో చెరువుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆశించిన స్థాయిలో రైతులకు సాగునీరు అందడం లేదు. మండల పరిధిలోని హుస్సేన్ సాహెబ్, అగ్గనూరు రెడ్డి చెరువు, జుంటుపల్లి ఉద్దండ రావు చెరువు, పెర్కంపల్లి సదర్ చెరువుల్లో మరమ్మతులు చేస్తే రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.