E.G: కడియం మండలంలో ఓ సంస్థ చెల్లించాల్సిన రూ. 1.47 కోట్ల ఇంటి పన్ను బకాయిలను వెంటనే కట్టాలని ఎంపీడీవో కె. రమేశ్ కోరారు. బుధవారం అధికారుల బృందం సంస్థ ప్రతినిధులను కలిసి పన్ను వివరాలను అందజేశారు. గ్రామపంచాయతీకి రావాల్సిన ఈ భారీ నిధులను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని అధికారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.