TPT: శ్రీదేవి కాంప్లెక్స్ గేట్ వద్ద ఈస్ట్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిలో ఇంద్రావత్ పవన్ కుమార్ నాయక్, ఎరగ అశోక్ ఉన్నారు. వీరు శ్రీనివాసం, విష్ణునివాసం, బస్టాండ్ ప్రాంతాల్లో భక్తుల నుంచి సెల్ ఫోన్లు, నగదు, బంగారు నగలు అపహరిస్తూ దొంగతనాలు చేస్తున్నారు. పోలీసులు వారి నుంచి రూ. 2.5 లక్షల విలువైన 14 ఫోన్లు, రూ. 3 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.