MHBD: తొర్రూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చర్లపాలెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల లచ్చమ్మపై ఆమె కుమారుడు యాకయ్య మద్యం మత్తులో బుధవారం రాత్రిగొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన లచ్చమ్మను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ఎంజీఎం హాస్పిటల్ కుతరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితుడు పరారైనట్లు తెలిసింది.