ATP: ప్రభుత్వం విద్యార్థుల కోసం నిధులు ఖర్చు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పనులు నిలిచిపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. రాయదుర్గం మండలం ఉడేగోళం పాఠశాలలో మంజూరైన వంటగది, మరుగుదొడ్ల నిర్మాణాలు బిల్లులు రాక ఆగిపోయాయి. ఫలితంగా విద్యార్థులు బయట కాలకృత్యాలకు వెళ్లాల్సి వస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండేందుకు వంటగది లేకపోవడంతో ఆరుబయట వంట చేస్తున్నారు.