T20 WCలో ఆల్ రౌండర్ శివమ్ దూబె బౌలర్గా పెద్ద ప్రభావం చూపలేకపోయాడు. అంతేకాకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో వెస్టిండీస్తో మ్యాచ్లో దూబేకు బౌలింగ్ కూడా ఇవ్వలేదు. దీనిపై తాజాగా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ.. దూబెపై నమ్మకం ఉందని, అతడిని ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసన్నాడు. సెమీస్లో దుబే బౌలింగ్ సేవలను ఉపయోగించుకుంటామని తెలిపాడు.