PPM: నిర్దేశిత లక్ష్యాలే ధ్యేయంగా అసంక్రమిత వ్యాదుల సర్వే చేపట్టాలని ఎన్.సి.డి అధికారి డా.టి. జగన్ మోహనరావు స్పష్టం చేశారు. క్రిష్ణపల్లిలో హెల్త్ వెల్నెస్ కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతీరోజు ఆరోగ్య తనిఖీల నిర్వహణ, పరీక్షలు, చికిత్సా వివరాలపై రికార్డుల్లో పరిశీలించారు. అలాగే, కొనసాగుతున్న ఎన్.సి.డి 4.0 సర్వేపై ఆరా తీశారు.