AP: నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను తరలించేందుకు ఖాట్మండు నుంచి విశాఖకు విమానం సర్వీసు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. నేపాల్లో ఇప్పటివరకు 215 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు సమాచారం. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు తక్షణ సాయం, తరలింపుపై అధికారులకు బాధ్యతలు అప్పగించారు.