GDWL: తన కుమారుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి వివాహ వేడుకకు రావాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బుధవారం మంత్రి సీతక్కను, ఎంపీ మల్లు రవిని ఆహ్వానించారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. మార్చి 14న గద్వాలలో జరిగే ఈ వివాహ వేడుకకు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.