AKP: నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం ఆకస్మికంగా చేపట్టిన డ్రోన్ తనిఖీలలో సుమారు వందమందికి పైగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ.. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని సూచించారు.