PDPL: జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కెనాల్ డి 83, డి 86 కాలువలకు 5వ విడత నీటి విడుదల ఈనెల 1న ప్రారంభమైందని జిల్లా ఇరిగేషన్ అధికారి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 9 వరకు 8 రోజులపాటు నీటి విడుదల జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని కాలువల ద్వారా చివరి ఆయకట్టుకు నీటిని అందించేందుకు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, రైతులు వారికి సహకరించాలని కోరారు.