NLR: నెల్లూరు నవాబుపేటలోని శ్రీమహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణ పనులపై కమిటీ సభ్యులతో చర్చించారు. సుమారు 100 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయంలో 2024లో భక్తుల సహకారంతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. టీటీడీ దృష్టికి తీసుకెళ్తే తగిన సాయం అందుతుందని సూచించారు.