NLG: చిట్యాల మండలం ఏపూరు గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. యువత భవిష్యత్తు, కుటుంబాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ సర్పంచ్ పాలెం మహేష్ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. రేపటి నుంచి గ్రామంలో ఎలాంటి మద్యం, మత్తు పానీయాల విక్రయాలు జరపబోమని నిర్వాహకులు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు.