ADB: నార్నూర్ మండల కేంద్రంలో బుధవారం ఉచిత మెగా వైద్య శిభిరాన్ని నిర్వహించారు. జిల్లా అదనపు వైద్యాధికారి మనోహర్ ఆధ్వర్యంలో RIMS వైద్యులు వివిధ పరీక్షలు చేశారు. అనంతరం రోగులకు మందులను పంపిణి చేసి, తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని జిల్లా రిమ్స్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు మాజ్ అహ్మద్, సాగర్ రెడ్డి, హరి ప్రసాద్ ఉన్నారు.